మలయాళం స్టార్ షకీలా 250వ చిత్రం వస్తోంది
- January 27, 2018హైదరాబాద్: జీ స్టూడియోస్ పతాకంపై మలయాళం స్టార్ షకీలా హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీలవతి’. సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లో ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ‘మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు గణేష్, వీరబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ‘ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. గీతాంజలి, లడ్డు, అశోక్బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ కరమ్తోత్, డైలాగ్స్: యష్ యాదవ్.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









