మలయాళం స్టార్‌ షకీలా 250వ చిత్రం వస్తోంది

- January 27, 2018 , by Maagulf

హైదరాబాద్‌: జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళం స్టార్‌ షకీలా హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీలవతి’. సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 
ఈ సందర్భంగా సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ‘మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. మా నిర్మాతలు గణేష్‌, వీరబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు. 
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్‌. గణేష్‌ మాట్లాడుతూ.. ‘ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. గీతాంజలి, లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తరుణ్‌ కరమ్‌తోత్‌, డైలాగ్స్‌: యష్‌ యాదవ్‌.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com