మలయాళం స్టార్ షకీలా 250వ చిత్రం వస్తోంది
- January 27, 2018హైదరాబాద్: జీ స్టూడియోస్ పతాకంపై మలయాళం స్టార్ షకీలా హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీలవతి’. సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లో ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ‘మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మా నిర్మాతలు గణేష్, వీరబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ‘ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు. గీతాంజలి, లడ్డు, అశోక్బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తరుణ్ కరమ్తోత్, డైలాగ్స్: యష్ యాదవ్.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







