పాకిస్థాన్ అమ్ములపొదిలో శక్తివంతమైన ఓ ఆయుధం
- January 27, 2018
న్యూఢిల్లీ : భారత సైన్యాన్ని కలవరపాటుకు గురిచేసే వార్త. దాయాది పాకిస్థాన్ అమ్ములపొదిలో శక్తివంతమైన ఓ ఆయుధం వచ్చి చేరింది. వింగ్ లూంగ్-1 అనే యుద్ధ విమానాలు(డ్రోన్లు) పాక్ వైమానిక దళంలో చేరినట్లు సమాచారం. చైనా నుంచి పాక్ వీటిని కొనుగోలు చేసుకుంది.
వింగ్ లూంగ్ సామర్థ్యం.. మానవ రహిత విమానాలైన 'వింగ్ లూంగ్' ను చైనా తయారు చేస్తోంది. లక్ష్యాలను నిర్దేశిస్తే చాలూ శత్రు స్థావరాలను వాటంతట అవే వెతుక్కుని వెళ్లి బాంబు దాడులు చేసి రాగలవు. పైగా తక్కువ ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో వీటిని కనుగొనటం రాడార్లకు కూడా కష్టమే. సుమారు 280 కిలోమీటర్ల వేగంతో 5 వేల కిలోమీటర్ల దూరం వరకు ఇవి ప్రయాణించగలవు. మెరుపు వేగంతో ఇవి దాడి చేయటంతో ప్రత్యర్థులకు వీటిని గుర్తించే సమయం కూడా ఉండదు. అంతటి విశేషాలున్న వింగ్ లూంగ్ను పాక్ తన అమ్ములపొదిలో చేర్చుకుంది.
సుమారు 14 మీటర్ల పొడవుండే ఈ డ్రోన్ విమానాలు ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణం చేస్తాయి. తేలికపాటి మిసైల్స్ తోపాటు 200 కిలోల బరువైన బాంబులను మోసుకుంటూ వెళతాయి. వారం క్రితమే చైనా వీటిని పాక్ కు చేరవేసిందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వింగ్ లూంగ్ సిరీస్లో నాలుగో తరం డ్రోన్ ల కోసం చైనా పరిశోధనలు చేస్తోంది. ఈ తరహా డ్రోన్ లు భారత్ వద్ద లేవని.. భారత సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







