మరోసారి గాత్రాన్ని వినిపించిన కలెక్షన్ కింగ్
- January 28, 2018
సీనియర్ నటుడు మోహన్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రిభినయం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయమోకటి బయటకు వచ్చింది. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
‘అండ పిండ బ్రహ్మాండ..’ అంటూ సాగే హనుమాన్ పాటను రిలీజ్ చేశారు. తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను శంకర్ మహదేవన్తో కలిసి మోహన్ బాబు ఆలపించారు. గతంలో ‘తప్పుచేసి పప్పుకూడు’ సినిమాకోసం ‘అంతన్నాడింతన్నాడే’ అనే పాటలోనూ తన గాత్రాన్ని వినిపించారు కలెక్షన్ కింగ్. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో మంచు విష్ణు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







