నేటి నుంచి టాటా ట్రస్ట్ టెలీ వైద్య సేవలు
- January 28, 2018_1517199343.jpg)
గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం కరెన్సీనగర్ (విజయవాడ), న్యూస్టుడే: టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ సేవలను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ట్రస్ట్ సౌత్ హెడ్ ఆర్.పవిత్రకుమార్ తెలిపారు. విజయవాడలోని శ్రీరామచంద్రనగర్లోని ఏఎన్ఆర్ కాంప్లెక్స్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా విజయవాడ రూరల్ పరిధిలోని 265 గ్రామాల్లో టాటా ట్రస్ట్చే వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ ఏడాది మరింత ఆధునిక, స్పెషాలిటీ వైద్యులచే టెలీ మెడిసిన్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద వైద్య సేవలు అందించేందుకు ట్రస్ట్ ముందుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా 20 టెలీ మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారుర. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు ఈ సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీరామచంద్రనగర్లోని ట్రస్టు కార్యాలయంలో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండి ఇక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగుల సమస్యలు తెలుసుకుని, టెలీమెడిసిన్ సెంటర్లలో సిబ్బందికి సూచనలు ఇచ్చి చికిత్స అందిస్తారని వెల్లడించారు. వ్యాధి తీవ్రత బట్టి ట్రస్టుచే అనుసంధానమైన 80 కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వివరించారు. ఈ సంవత్సరం టాటా ట్రస్టుచే రోగులకు లక్ష రూపాయల బీమాను ఉచితంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.సమావేశంలో ట్రస్టు ప్రాంతీయ అధికారి రాజేంద్రబాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి