నేటి నుంచి టాటా ట్రస్ట్ టెలీ వైద్య సేవలు
- January 28, 2018
గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం కరెన్సీనగర్ (విజయవాడ), న్యూస్టుడే: టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ సేవలను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ట్రస్ట్ సౌత్ హెడ్ ఆర్.పవిత్రకుమార్ తెలిపారు. విజయవాడలోని శ్రీరామచంద్రనగర్లోని ఏఎన్ఆర్ కాంప్లెక్స్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా విజయవాడ రూరల్ పరిధిలోని 265 గ్రామాల్లో టాటా ట్రస్ట్చే వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ ఏడాది మరింత ఆధునిక, స్పెషాలిటీ వైద్యులచే టెలీ మెడిసిన్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద వైద్య సేవలు అందించేందుకు ట్రస్ట్ ముందుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా 20 టెలీ మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారుర. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు ఈ సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీరామచంద్రనగర్లోని ట్రస్టు కార్యాలయంలో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండి ఇక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగుల సమస్యలు తెలుసుకుని, టెలీమెడిసిన్ సెంటర్లలో సిబ్బందికి సూచనలు ఇచ్చి చికిత్స అందిస్తారని వెల్లడించారు. వ్యాధి తీవ్రత బట్టి ట్రస్టుచే అనుసంధానమైన 80 కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వివరించారు. ఈ సంవత్సరం టాటా ట్రస్టుచే రోగులకు లక్ష రూపాయల బీమాను ఉచితంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.సమావేశంలో ట్రస్టు ప్రాంతీయ అధికారి రాజేంద్రబాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









