ఇండియాతో చైనా చర్చలకు సిద్ధం
- January 29, 2018
బీజింగ్ః వివాదాస్పద చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్ట్పై ఇండియాతో చర్చలకు తాము సిద్ధమని చైనా స్పష్టంచేసింది. 5 వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ విషయంలో భారత్కు ఉన్న అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరిస్తామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. చైనాలో భారత రాయబారిగా ఉన్న గౌతమ్ బాంబావాలె.. సీపీఈసీ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అన్నారు. అయితే ఈ విషయంలో చైనా తన వైఖరిని ఇప్పటికే స్పష్టంచేసిందని, రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చున్యింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య తలెత్తుతున్న విభేదాలను పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉన్నదని ఆమె అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఒక దేశాన్నే కోరడం సరికాదు. సమస్య పరిష్కారం కోసం ఇండియాతో కలిసి పనిచేయడానికి, చర్చించడానికి సిద్ధమని చున్యింగ్ చెప్పారు. సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్ట్. ఇది ఏ మూడో వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నది కాదు.
ఇండియా ఆ దిశగా ఆలోచించి, చైనాతో దోస్తీని బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాం అని చున్యింగ్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తున్న సీపీఈసీ ప్రాజెక్ట్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







