ఇండియాతో చైనా చర్చలకు సిద్ధం
- January 29, 2018
బీజింగ్ః వివాదాస్పద చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్ట్పై ఇండియాతో చర్చలకు తాము సిద్ధమని చైనా స్పష్టంచేసింది. 5 వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ విషయంలో భారత్కు ఉన్న అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరిస్తామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. చైనాలో భారత రాయబారిగా ఉన్న గౌతమ్ బాంబావాలె.. సీపీఈసీ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అన్నారు. అయితే ఈ విషయంలో చైనా తన వైఖరిని ఇప్పటికే స్పష్టంచేసిందని, రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చున్యింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య తలెత్తుతున్న విభేదాలను పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉన్నదని ఆమె అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఒక దేశాన్నే కోరడం సరికాదు. సమస్య పరిష్కారం కోసం ఇండియాతో కలిసి పనిచేయడానికి, చర్చించడానికి సిద్ధమని చున్యింగ్ చెప్పారు. సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్ట్. ఇది ఏ మూడో వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నది కాదు.
ఇండియా ఆ దిశగా ఆలోచించి, చైనాతో దోస్తీని బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాం అని చున్యింగ్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తున్న సీపీఈసీ ప్రాజెక్ట్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









