సౌదీ మార్గంలోనే ఉత్తరప్రదేశ్
- January 29, 2018
లక్నో: ఉత్తర ప్రదేశ్కి చెందిన దేవ్బంధ్ సంస్థ ముస్లిం మహిళల్లో క్రమశిక్షణ అలవర్చడమనే నెపంతో మరో ఫత్వాను జారీ చేసింది. ఇందులో భాగంగా ముస్లిం మహిళలు ఫుట్బాల్ ఆటను చూడటంపై నిషేధం విధించింది. ఫుట్బాల్ ఆటగాళ్లు మోకాళ్ల వరకు దుస్తులు ధరించడం కారణంగా వారికి ముస్లిం మహిళలు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలు మగ వాళ్లను ఆ విధంగా చూడటం ముస్లిం చట్టాల ప్రకారం పాపం అని దేవ్బంధ్ ప్రతినిధి ముఫ్తీ అతర్ కస్మీ అన్నారు.
2015లో సౌదీ అరేబియాలో జారీ చేసిన ఫత్వా ఆధారంగా ఈ కొత్త ఫత్వాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫుట్బాల్ ఆటలో స్కోర్లు, ఆనందం కోసం కాకుండా ఆటగాళ్ల కాళ్లను, తొడలను చూడటానికే ముస్లిం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో షేక్ సాద్ అల్ హజారీ ఫత్వా జారీ చేశారు. అలాగే భార్యలను ఫుట్బాల్ ఆట చూసేందుకు అనుమతిస్తున్న భర్తలకు కూడా ఆ ఫత్వాలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే ఫత్వా మార్గదర్శకాలను దేవ్బంధ్ సంస్థ కూడా అనుసరించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









