హజ్‌ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ

- January 30, 2018 , by Maagulf
హజ్‌ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ

అమరావతి : హజ్‌ యాత్రికులు మొదటి విడత 81 వేల రూపాయలు చెల్లింపునకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు పెంచుతూ సెంట్రల్‌ హజ్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎపి స్టేట్‌ హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ లియాఖత్‌ అలీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31వ తేదీన మొదటి విడత చెల్లించడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ హజ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హజ్‌ యాత్రికుడు 81 వేల రూపాయలు బ్యాంక్‌లో జమ చేసినట్లు ఒరిజినల్‌ బ్యాంక్‌ పే ఇన్‌ స్లిప్‌, మెడికల్‌ స్క్రీనింగ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌, వైట్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ కలర్‌ ఫొటోలను విజయవాడలోని ఎపి స్టేట్‌ హజ్‌ కమిటీ కార్యాలయంలో వెంటనే అందజేయాలని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com