హజ్ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ
- January 30, 2018
అమరావతి : హజ్ యాత్రికులు మొదటి విడత 81 వేల రూపాయలు చెల్లింపునకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు పెంచుతూ సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ అలీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31వ తేదీన మొదటి విడత చెల్లించడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హజ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హజ్ యాత్రికుడు 81 వేల రూపాయలు బ్యాంక్లో జమ చేసినట్లు ఒరిజినల్ బ్యాంక్ పే ఇన్ స్లిప్, మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాస్పోర్ట్, వైట్ బ్యాగ్గ్రౌండ్ కలర్ ఫొటోలను విజయవాడలోని ఎపి స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో వెంటనే అందజేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









