హజ్ మొదటి విడత చెల్లింపునకు ఫిబ్రవరి 12వ తేదీ కు పొడిగించిన కమిటీ
- January 30, 2018
అమరావతి : హజ్ యాత్రికులు మొదటి విడత 81 వేల రూపాయలు చెల్లింపునకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు పెంచుతూ సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఎపి స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ అలీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 31వ తేదీన మొదటి విడత చెల్లించడానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో సెంట్రల్ హజ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి హజ్ యాత్రికుడు 81 వేల రూపాయలు బ్యాంక్లో జమ చేసినట్లు ఒరిజినల్ బ్యాంక్ పే ఇన్ స్లిప్, మెడికల్ స్క్రీనింగ్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఒరిజినల్ పాస్పోర్ట్, వైట్ బ్యాగ్గ్రౌండ్ కలర్ ఫొటోలను విజయవాడలోని ఎపి స్టేట్ హజ్ కమిటీ కార్యాలయంలో వెంటనే అందజేయాలని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







