ప్రపంచ సుందరి కలలకు తొలి అడుగులు
- January 30, 2018
18న ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారతదేశానికి 17ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిన మానుషి చిల్లర్లా వెలగాలని ఆశించే యువతులు ఎందరో... వారి కలలను సాకారం చేసేందుకు తొలిమెట్టుగా భావించే ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియను బెంగళూరులో ఈనెల 18న నిర్వహిస్తారు. ప్రపంచ సుందరి నీలి కిరీటాన్ని మళ్లీ భారత్ ముంగిట ఉంచాలనుకునే వారికి నేహా ధూపియా, పూజా చోప్రా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్సింగ్ వంటి వారు శిక్షణ ఇవ్వనున్నారు. దిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30రాష్ట్రాల్లో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో అర్హత పొందిన వారు భారతదేశం తరపున ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటారు. మొత్తం రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి బెంగళూరు, కోల్కతా, దిల్లీ, ముంబయి వంటి వలయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. బెంగళూరులో 18, 24తేదీల్లో దక్షిణ వలయ స్థాయి ఎంపిక జరుగుతుంది. అనంతరం వివిధ వలయాల్లో గెలుపొందిన వారికి మే 13న ముంబయిలో అంతిమ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!
- సౌత్ సాద్ అల్-అబ్దుల్లా దుర్ఘటనలో ఒకరు మృతి..!!
- అభివృద్ధి ప్రాజెక్టులపై ధోఫార్ మున్సిపల్ కౌన్సిల్ సమీక్ష..!!
- యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- టీవీ లేకపోయినా పర్లేదు..మీ మొబైల్లో బడ్జెట్ స్పీచ్ చూసేయండి







