ప్రపంచ సుందరి కలలకు తొలి అడుగులు
- January 30, 2018
18న ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారతదేశానికి 17ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిన మానుషి చిల్లర్లా వెలగాలని ఆశించే యువతులు ఎందరో... వారి కలలను సాకారం చేసేందుకు తొలిమెట్టుగా భావించే ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియను బెంగళూరులో ఈనెల 18న నిర్వహిస్తారు. ప్రపంచ సుందరి నీలి కిరీటాన్ని మళ్లీ భారత్ ముంగిట ఉంచాలనుకునే వారికి నేహా ధూపియా, పూజా చోప్రా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్సింగ్ వంటి వారు శిక్షణ ఇవ్వనున్నారు. దిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30రాష్ట్రాల్లో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో అర్హత పొందిన వారు భారతదేశం తరపున ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటారు. మొత్తం రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి బెంగళూరు, కోల్కతా, దిల్లీ, ముంబయి వంటి వలయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. బెంగళూరులో 18, 24తేదీల్లో దక్షిణ వలయ స్థాయి ఎంపిక జరుగుతుంది. అనంతరం వివిధ వలయాల్లో గెలుపొందిన వారికి మే 13న ముంబయిలో అంతిమ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!







