ప్రపంచ సుందరి కలలకు తొలి అడుగులు
- January 30, 2018
18న ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారతదేశానికి 17ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిన మానుషి చిల్లర్లా వెలగాలని ఆశించే యువతులు ఎందరో... వారి కలలను సాకారం చేసేందుకు తొలిమెట్టుగా భావించే ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియను బెంగళూరులో ఈనెల 18న నిర్వహిస్తారు. ప్రపంచ సుందరి నీలి కిరీటాన్ని మళ్లీ భారత్ ముంగిట ఉంచాలనుకునే వారికి నేహా ధూపియా, పూజా చోప్రా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్సింగ్ వంటి వారు శిక్షణ ఇవ్వనున్నారు. దిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30రాష్ట్రాల్లో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో అర్హత పొందిన వారు భారతదేశం తరపున ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటారు. మొత్తం రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి బెంగళూరు, కోల్కతా, దిల్లీ, ముంబయి వంటి వలయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. బెంగళూరులో 18, 24తేదీల్లో దక్షిణ వలయ స్థాయి ఎంపిక జరుగుతుంది. అనంతరం వివిధ వలయాల్లో గెలుపొందిన వారికి మే 13న ముంబయిలో అంతిమ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







