మవసలాత్ ట్యాక్సీ ధరల తగ్గింపు
- January 31, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలత్), కొత్త ట్యాక్సీ ధరల్ని ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. మవసలాత్ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 ఒమన్ రియాల్తో మీటర్ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది పగటిపూట ధర. రాత్రి వేళల్లో ఈ ధర 1.3గా ఉంటుంది. ప్రతి కిలోమీటర్కి 200 బైజా అదనంగా తొలి 30 కిలోమీటర్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. పగలు, మరియు రాత్రి బుకింగ్ ఫీజు 500 బైజాస్గా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీలు మాల్స్ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్ పీరియడ్లో భాగంగా ట్యాక్సీ ఫేర్స్ జనవరి 31 వరకు, 1.2 ఒమన్ రియాల్స్తో రుసుములు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్







