యాప్ దొంగని పట్టించింది
- February 01, 2018
తెల్లవారుజామున నాలుగ్గంటల సమయంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడినుంచో వచ్చారు ముగ్గురు యువకులు అతడి చేతిలోని ఫోన్ లాక్కుని పరారయ్యారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారు జామున ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడి చేతిలో సెల్ ఫోను ఉంది. దూరం నుంచి గమనించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పరారయ్యారు. అతడు తేరుకునే లోపే వచ్చిన ముగ్గురూ కనిపించకుండా పోయారు. దీంతో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కంప్లైంట్ తీసుకున్న వెంటనే రంగలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలింపు జరిపారు. కంప్లైంట్ దారుడు ఫోన్లో 'ఫైండ్ మై డివైజ్' అనే యాప్ ఉన్నట్లు పోలీసులకు తెలియజేశాడు. వెంటనే పోలీసులు గూగుల్ మ్యాప్లో ఫోన్ ఎక్కడ ఉందీ గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా చీకటిగా ఉండడంతో ఎవరూ కనిపించలేదు. అయితే అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలు తనిఖీ చేయగా అందులో ఒక వాహనం సైలెన్సర్ వేడిగా ఉండడాన్ని గుర్తించారు. దొంగ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని భావించిన పోలీసులు అక్కడే కొద్ది సేపు గమనించారు. వాహనదారుడిని గుర్తించారు. అరగంట వ్యవధిలోనే వారిని పట్టుకున్నారు. అతడితో పాటు సహకరించిన మరో ఇద్దరినీ కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. నిందితులను వెంటనే పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు