జర్మనీలో ఐదు లక్షలమంది కార్మికుల స్ట్రైక్

- February 03, 2018 , by Maagulf
జర్మనీలో ఐదు లక్షలమంది కార్మికుల స్ట్రైక్

బెర్లిన్‌ : వేతనాలను పెంచాలని కోరుతూ జర్మనీలో దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 97 కంపెనీల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని ఐజి మెటల్‌ కార్మిక సంఘం తెలిపింది. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు జరిగిన సమ్మెలో ఐదు లక్షలమందికి పైగా కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బy ేరియా, బాడెన్‌ వుటెంబర్గ్‌ల్లో ఆటో పరిశ్రమ మొత్తంగా శుక్రవారం మూత పడింది. హాంబర్గ్‌, బ్రెమెన్‌, లోయర్‌ సాక్సోనీల్లో పలు షిప్‌యార్డ్‌్‌ల్లో, ఎయిర్‌ బస్‌ ప్లాంట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com