తెలంగాణా టీ ట్వంటీ లీగ్లో ఆడుతున్న టాలీవుడ్ స్టార్స్...
- February 03, 2018
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణా టీ ట్వంటీ లీగ్కు ఉప్పల్ స్టేడియంలో తెరలేచింది. భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ లీగ్ను ప్రారంభించారు. తెలంగాణా వ్యాప్తంగా జిల్లాల్లో మ్యాచ్లు నిర్వహించి ఎంపిక చేసిన అత్యుత్తమ ప్లేయర్లతో 10 జట్లు లీగ్లో తలపడుతున్నాయి. రంజీ ఆటగాళ్ళతో పాటు టాలీవుడ్ స్టార్స్ అక్కినేని అఖిల్, సుధీర్బాబు ఈ లీగ్లో ఆడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లను ప్రోత్సహించేందుకు లీగ్ నిర్వహిస్తోన్న హెచ్సిఎ ప్రెసిడెంట్ వివేక్ను కపిల్దేవ్ అభినందించారు. రానున్న రోజుల్లో తెలంగాణా నుంచి జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్ళు చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. లీగ్ ఆరంభ వేడుకల్లో టాలీవుడ్ హీరోలు వెంకటేష్ , శ్రీకాంత్ సందడి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







