వెంకటేష్, తేజ కంబినేషన్లో మూవీ
- February 04, 2018
సీనియర్ హీరో వెంకటేష్ గత ఏడాది గురు సినిమాలో నటించారు. ఆ తర్వాత కొత్త చిత్రమేదీ అంగీకరించలేదు. అనేక కథలు విన్నప్పటికీ ఫైనలైజ్ చేయలేదు. కొత్తదనం ఉన్న కథలు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రీమేక్లపై కూడా దృష్టి పెట్టారు. కానీ ఏదీ కూడా కొలిక్కిరాలేదు. ఈ లోపు దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చింది. వెంటనే డేట్స్ ఇచ్చేశారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమా సక్సెస్తో తేజపై నమ్మకం పెరిగింది. వైవిథ్యమైన కథాశంతో తేజ చెప్పిన కథకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇదేనెలాఖరున షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకటేష్తో పాటుగా నారా రోహిత్ మరో ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లు ఎవరనే దానిపై ఇంకా స్పష్టతరాలేదు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక