వెంకటేష్, తేజ కంబినేషన్లో మూవీ
- February 04, 2018
సీనియర్ హీరో వెంకటేష్ గత ఏడాది గురు సినిమాలో నటించారు. ఆ తర్వాత కొత్త చిత్రమేదీ అంగీకరించలేదు. అనేక కథలు విన్నప్పటికీ ఫైనలైజ్ చేయలేదు. కొత్తదనం ఉన్న కథలు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రీమేక్లపై కూడా దృష్టి పెట్టారు. కానీ ఏదీ కూడా కొలిక్కిరాలేదు. ఈ లోపు దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చింది. వెంటనే డేట్స్ ఇచ్చేశారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమా సక్సెస్తో తేజపై నమ్మకం పెరిగింది. వైవిథ్యమైన కథాశంతో తేజ చెప్పిన కథకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇదేనెలాఖరున షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకటేష్తో పాటుగా నారా రోహిత్ మరో ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లు ఎవరనే దానిపై ఇంకా స్పష్టతరాలేదు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







