అభిమాని మరణంతో.. లారెన్స్ షాకింగ్ డెసిషన్
- February 04, 2018
తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఏ ప్రముఖుడూ తీసుకొని ఉండరు. అసలు విషయం ఏంటంటే.. ఆర్.శేఖర్ అనే లారెన్స్ అభిమాని ఆయనతో పిక్ తీసుకునేందుకు వెళ్లి చనిపోయాడు. ఇది లారెన్స్ను చాలా బాధించింది. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తనకోసం రావద్దని స్పష్టం చేశారు.
ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. ''హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్..! నాతో పిక్ తీసుకునేందుకు వస్తూ నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ తెలుసు. అతని అంత్యక్రియలకు నేను వెళ్లాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఇన్సిడెంట్తో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నాతో ఫోటోలు దిగేందుకు మీరెవ్వరూ రావద్దు.
నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను. ఇప్పటి నుంచి నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ప్రతి ఒక్క ఏరియాకు వచ్చి ఫోటోలు దిగుతాను. మొదటగా నేను దీన్ని 7వ తేదీన సేలం నుంచి ప్రారంభిస్తున్నాను. నేను మీకోసం వస్తున్నా..
శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నాను.'' అని లారెన్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే గుండె సంబంధ బాధిత పిల్లలను ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







