పెట్రోలు బంకులో పెట్రోలు అమ్మిన భాగమతి అనుష్క
- February 04, 2018
" భాగమతి " సినిమాతో హిట్ కొట్టిన అనుష్క..పెట్రోలు బంకులో పెట్రోలు కొడుతూ ప్రత్యక్ష మైంది. మరేం లేదు.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఇందుకు పూనుకొంది. నటి మంచు లక్ష్మి హోస్ట్ గా ఓ టీవీ చానల్ లో ప్రసారం కానున్న " మేము సైతం " అనే కార్యక్రమం కోసం ఈ అమ్మడు పెట్రోలు బంకులో వినియోగదారులకు పెట్రోలు అమ్ముతూ సామాజిక సేవ చేసింది. " మేము సైతం " కార్యక్రమానికి గెస్టుగా వచ్చే సెలబ్రిటీలు ఏదో ఒక పని చేసి అలా వచ్చే సొమ్ముతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ ప్రోగ్రాం ముఖ్య లక్ష్యం. ఈ కార్యక్రమ ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మిన సీన్స్ చిత్రీకరించారు. ఆమెను చూసేందుకు వాహనదారులు, అభిమానులు పోటీలు పడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







