ఆవిష్కృతమైన రిచ్ రాజస్తానీ రాయల్ కల్చర్
- February 05, 2018
సఖిర్: రాజస్తానీ రాయల్ కల్చర్, ఆర్ట్, ఫుడ్, మ్యూజిక్ మరియు డాన్స్ వంటివన్నీ 'పదారో మిహారె దేశ్ 2018' ఈవెంట్లో కనువిందు చేశాయి. బహ్రెయిన్లోని రాజస్తానీలు (ఆర్ఐబి) ఈ ఈవెంట్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియన్ ఎంబసీతో కలిసి ఫిబ్రవరి 2న ఈ వెంట్ నిర్వహించడం జరిగింది. బహ్రెయిన్లో ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బహ్రెయిన్తోపాటు, భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్, బ్యాంకర్స్, ఎంబసీ అధికారులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. అలోక్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఇండియన్ టూరిజంని ఈ తరహా ఈవెంట్స్తో ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆర్ఐబి హెడ్ అలోక్ గుస్తా, బహ్రెయిన్ అభివృద్ధిలో రాజస్తానీయుల పాత్ర చాలా గొప్పదనీ, అలాగే భారతీయులకు బహ్రెయిన్లో రాజస్థానీయులు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. రాజస్థానీయులు తమ మాతృభూమిని అమితంగా ప్రేమిస్తారనీ, పని పట్ల తమకు చాలా నిబద్ధత ఉంటుందని ఈ సందర్భంగా అలోక్ గుప్తా వివరించారు. బహ్రెయిన్ని కర్మ్ భూమి (వర్క్ ప్లేస్)గా అభివర్ణించారాయన. 40 రకాలైన రాజస్తానీ ఫుడ్ డెలికసీస్ ఈ వెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారత ప్రభుత్వ నినాదం 'బేటీ బచావో బేటీ పడావో'ని ఇక్కడ గట్టిగా వినిపించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







