నిఖిల్ బాబూ.. నీకెందుకయ్యా పాలిటిక్స్ ..!
- February 06, 2018
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు.. ముందడుగేస్తేనే కదా మార్పు అనేది సాధ్యం..? ఈ మాటను బాగా ఒంటబట్టించుకున్నాడో ఏమో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నేను సైతం అంటూ ముందుకురికాడు. పట్టుమని పది సినిమాలైనా చేయని ఈ బుడతడు ఇప్పుడు సడన్ గా రాజకీయాలు మాట్లాడ్డం మొదలుపెట్టాడు. సినిమా వాళ్ళు రాజకీయాలు చేయడం కొత్తేమీ కానప్పటికీ.. నిఖిల్ కూడానా అంటూ.. ఆసక్తిగా చూస్తోంది టాలీవుడ్.
విషయం ఏమిటంటే.. నిఖిల్ బాబు తాజాగా ఒక ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ మరో 'బాబు'ని టార్గెట్ చేస్తున్నట్లుండడమే ఇక్కడ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. ఏపీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాల్సిందే.. అనేది ఆ ట్వీట్ అసలు తాత్పర్యం. "ఈ మధ్యే నేను ఏపీలో షూటింగ్ చేశా. అక్కడంతా చూస్తే చాలా బాధేసింది. ఇంకా డెవలప్ కావాలి..
ఆలా కావాలంటే చాలా ఫండ్స్ రావాలి" అంటూ రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలను సున్నితంగా టార్గెట్ చేశాడు. 'ఎస్.. యువ్వార్ కరెక్ట్ బాస్..' అంటూ నిఖిల్ ట్వీట్ కి మాంచి రియాక్షన్ వచ్చింది.. వస్తోంది.
"ఇవన్నీ నీకెందుకు అని మీరు అడగొచ్చు.. కానీ సగటు భారతీయుడిగా అడిగే హక్కు నాకుంది.." అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చుకున్నాడు.
స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వకుండా మొహం చాటేసిన బీజేపీని, స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్వాలేదన్న టీడీపీని కలిపి తిట్టినట్టుంది నిఖిల్ ట్వీట్. పవన్ కళ్యాణ్ తరహాలో ప్రశ్నించే గుణాన్ని తాను కూడా అలవర్చుకుంటున్నాడని కొందరంటే..
కాదుకాదు.. అతడి 'కిర్రాక్ పార్టీ' సినిమా ప్రమోషన్ కోసమే ఇలా రోడ్డుమీద పడ్డారని మరికొందరు సెటైర్లేస్తున్నారు. అయినా.. హైదరాబాద్ బేగంపేటలో పుట్టి..
బంజారా హిల్స్ ముఫకం ఝా కాలేజ్ లో చదువుకున్న ఈ పక్కా తెలంగాణా కుర్రోడికి.. ఆంధ్రాకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ తో పనేంటన్న ప్రశ్నలు కూడా పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







