హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం
- February 06, 2018
హైదరాబాద్: హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్ని ప్రమాగం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి.
దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలో ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగి సామాగ్రి అంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ముఖ్యమైన దస్తావేజులు, ఫర్నిచర్ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
సకాలంలో రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేశాయి. సుమారు గంటసేపు ప్రయత్నించి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..









