హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం
- February 06, 2018
హైదరాబాద్: హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్ని ప్రమాగం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం సాయంత్రం స్టేషన్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయి.
దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరోవైపు వెల్డింగ్ పనులు చేస్తున్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలో ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగి సామాగ్రి అంతా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ముఖ్యమైన దస్తావేజులు, ఫర్నిచర్ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
సకాలంలో రెండు ఫైరింజన్లు చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపు చేశాయి. సుమారు గంటసేపు ప్రయత్నించి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







