నిరుద్యోగులను నిండా ముంచిన ఏఎస్ఆర్ కన్సల్టెన్సీ
- February 06, 2018
హైదరాబాద్: ఓ కన్సల్టెన్సీ సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చైతన్యపురి చౌరస్తాలో గల ఏఎస్ఆర్ ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ చర్యతో మోసపోయిన నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దుబాయ్-మరీనా మాల్లలో అదేవిధంగా దేశంలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉచిత వీసా, ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో భాగంగా మెడికల్ టెస్ట్ పేరుతో రూ. 3 వేలను నిర్వాహకులు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. కాలయాపన చేస్తుండటంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన నిరుద్యోగులు పెద్దఎత్తున చేరుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కన్సల్టెన్సీ నిర్వహాకుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!









