నిరుద్యోగులను నిండా ముంచిన ఏఎస్ఆర్ కన్సల్టెన్సీ
- February 06, 2018
హైదరాబాద్: ఓ కన్సల్టెన్సీ సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చైతన్యపురి చౌరస్తాలో గల ఏఎస్ఆర్ ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ చర్యతో మోసపోయిన నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దుబాయ్-మరీనా మాల్లలో అదేవిధంగా దేశంలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉచిత వీసా, ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో భాగంగా మెడికల్ టెస్ట్ పేరుతో రూ. 3 వేలను నిర్వాహకులు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. కాలయాపన చేస్తుండటంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన నిరుద్యోగులు పెద్దఎత్తున చేరుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కన్సల్టెన్సీ నిర్వహాకుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి