నిరుద్యోగులను నిండా ముంచిన ఏఎస్ఆర్ కన్సల్టెన్సీ
- February 06, 2018
హైదరాబాద్: ఓ కన్సల్టెన్సీ సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చైతన్యపురి చౌరస్తాలో గల ఏఎస్ఆర్ ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ చర్యతో మోసపోయిన నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దుబాయ్-మరీనా మాల్లలో అదేవిధంగా దేశంలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉచిత వీసా, ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో భాగంగా మెడికల్ టెస్ట్ పేరుతో రూ. 3 వేలను నిర్వాహకులు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. కాలయాపన చేస్తుండటంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన నిరుద్యోగులు పెద్దఎత్తున చేరుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కన్సల్టెన్సీ నిర్వహాకుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై బాధితులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







