'ఓటరు' మూవీ మార్పు కోసమే అంటున్న మంచు విష్ణు.
- February 06, 2018
యంగ్ హీరో మంచు విష్ణు ఇప్పటికే రెండు మూవీలను పూర్తి చేశాడు.. అందులో ఒకటి గాయత్రి ఈ నెల 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక అచారి ఆమెరికా యాత్ర మూవీని మార్చిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.. ఈ మూవీల తర్వాత విష్ణు చేస్తున్న మూవీ ఓటరు.. ఈ మూవీకి గజ్జెల కార్తీక్ రెడ్డి దర్శకుడు.ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.. ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.. ఈ మూవీ గురించి విష్ణు మాట్లాడుతూ, సోషల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం 'ఓటు వేసేవాడు యజమాని, ఆ ఓట్లతో గెలిచినవాడు సేవకుడు' అనే సందేశాన్ని చెబుతుందని, అది చూసి కొంతమందైనా మారతారనేది తన నమ్మకమని అన్నాడు.. ఈ మూవీలో సురభి హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







