అబుధాబిలో 44 వాహనాల ఢీ: 22 మందికి గాయాలు
- February 06, 2018
అబుధాబి:అబుదాబీలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ స్ట్రీట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 44 వాహనాలు ధ్వంసం కాగా, 22 మంది గాయాలపాలయ్యారు. అబుదాబీ పోలీసులు ఈ ఘటన గురించి వివరిస్తూ, ఉదయం 8 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు. తక్కు విజిబిలిటీ కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఒకదాని తర్వాత ఇంకో వాహనం వరుసగా ఒకదాన్నొకటి వెనుకనుంచి ఢీకొనడంతో మొత్తం 44 వాహనాలు ధ్వంసమయ్యాయి. తక్కువ విజిబిలిటీ వున్న సమయంలో వాహనదారులు తమ వాహనాల్ని నెమ్మదిగా నడపాలనీ, వీలైనంతవరకు తక్కువ విజిబిలిటీ వున్నప్పుడు ప్రయాణం చేయడం తగ్గించాలని అబుదాబీ పోలీసులు సూచించారు. విజిబిలిటీ లేకున్నా అతి వేగంతో వెళ్ళే వాహనాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







