అబుధాబిలో 44 వాహనాల ఢీ: 22 మందికి గాయాలు

- February 06, 2018 , by Maagulf
అబుధాబిలో 44 వాహనాల ఢీ: 22 మందికి గాయాలు

అబుధాబి:అబుదాబీలోని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ స్ట్రీట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 44 వాహనాలు ధ్వంసం కాగా, 22 మంది గాయాలపాలయ్యారు. అబుదాబీ పోలీసులు ఈ ఘటన గురించి వివరిస్తూ, ఉదయం 8 గంటల సమయంలో యాక్సిడెంట్‌ జరిగినట్లు చెప్పారు. తక్కు విజిబిలిటీ కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఒకదాని తర్వాత ఇంకో వాహనం వరుసగా ఒకదాన్నొకటి వెనుకనుంచి ఢీకొనడంతో మొత్తం 44 వాహనాలు ధ్వంసమయ్యాయి. తక్కువ విజిబిలిటీ వున్న సమయంలో వాహనదారులు తమ వాహనాల్ని నెమ్మదిగా నడపాలనీ, వీలైనంతవరకు తక్కువ విజిబిలిటీ వున్నప్పుడు ప్రయాణం చేయడం తగ్గించాలని అబుదాబీ పోలీసులు సూచించారు. విజిబిలిటీ లేకున్నా అతి వేగంతో వెళ్ళే వాహనాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com