మావ పై అల్లుడు కర్రతో దాడి ...ఆత్మరక్షణ కోసం తప్పలేదంటున్న నిందితుడు
- February 06, 2018
కువైట్: పిల్ల నిచ్చిన మావను ఒక బలమైన మందపాటి పొన్నుకర్రతో ఎముకలు విరిగేటట్టు చితకకొట్టాడా అల్లుడు. పైగా ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేయాల్సివచ్చిందని నిజాయితీగా ఒప్పుకొంటున్నాడు. ఈ వారాంతంలో తనంతట తానే లొంగిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నానని ఈ లోపునే మీరు పట్టుకొన్నారని పోలీసులతో నిష్ఠూరంగా నిందితుడు తెలిపాడు. శరీరంపై వివిధ ప్రాంతంలో ఎముకలు చిట్లిన పరిస్థితిలో బాధితుడిని చికిత్స కోసం జహ్రా ఆసుపత్రికి తరలించినట్లు భద్రతాధికారులు తెలిపారు. తన అల్లుడు ఎందుచేతనో ఆగ్రహించి జహ్రాలో తనను పరుగులు పెట్టించాడని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. రాహాయాలో అనుమానితుడిని జహ్రా డిటెక్టివ్ లు గుర్తించగలిగారు, వెంటనే ఆ ఘరానా అల్లుడిని అరెస్టు చేసి ఈ కేసు విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









