మావ పై అల్లుడు కర్రతో దాడి ...ఆత్మరక్షణ కోసం తప్పలేదంటున్న నిందితుడు
- February 06, 2018
కువైట్: పిల్ల నిచ్చిన మావను ఒక బలమైన మందపాటి పొన్నుకర్రతో ఎముకలు విరిగేటట్టు చితకకొట్టాడా అల్లుడు. పైగా ఆత్మరక్షణ కోసం ఆ విధంగా చేయాల్సివచ్చిందని నిజాయితీగా ఒప్పుకొంటున్నాడు. ఈ వారాంతంలో తనంతట తానే లొంగిపోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నానని ఈ లోపునే మీరు పట్టుకొన్నారని పోలీసులతో నిష్ఠూరంగా నిందితుడు తెలిపాడు. శరీరంపై వివిధ ప్రాంతంలో ఎముకలు చిట్లిన పరిస్థితిలో బాధితుడిని చికిత్స కోసం జహ్రా ఆసుపత్రికి తరలించినట్లు భద్రతాధికారులు తెలిపారు. తన అల్లుడు ఎందుచేతనో ఆగ్రహించి జహ్రాలో తనను పరుగులు పెట్టించాడని బాధితుడు పోలీసుల ఎదుట వాపోయాడు. రాహాయాలో అనుమానితుడిని జహ్రా డిటెక్టివ్ లు గుర్తించగలిగారు, వెంటనే ఆ ఘరానా అల్లుడిని అరెస్టు చేసి ఈ కేసు విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







