దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- February 06, 2018
దుబాయ్:భారతదేశంలోని బెంగళూరుకి చెందిన టామ్స్ అరాకల్ మణి అనే అదృష్టవంతుడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. 263 సిరీస్లో 2190 నెంబర్ టిక్కెట్ని ఆయన కొనుగోలు చేశారు. దుబయాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంకోర్స్ డి వద్ద తీసిన డ్రాలో విజేతను ఎంపిక చేశారు. 38 ఏళ్ళ మణి, ఇంటర్నేషనల్ కార్డ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓ రిటెయలర్ వద్ద 34వ యానివర్సరీ సందర్భంగా డిసెంబర్లో ఈ టిక్కెట్ని ఆయన కొనుగోలు చేశారు. 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని ఆయన అన్నారు. 1999లో మొదలైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం ప్రమోషన్లో ఇప్పటిదాకా 124 మంది భారతీయులు 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇదిలా వుంటే 33 ఏళ్ళ లతా బరద్వాజ్ బిఎండబ్ల్యు 750 ఎల్ఐఎక్స్ డ్రైవ్ ఎం స్పోర్ట్ కారుని గెల్చుకున్నారు. ఆమె దుబాయ్ డ్యూటీ ఫ్రీ మాజీ ఉద్యోగి. ఒకప్పటి సన్నిహితుల్ని కలుసుకోవడం, కారుని గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..







