దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- February 06, 2018
దుబాయ్:భారతదేశంలోని బెంగళూరుకి చెందిన టామ్స్ అరాకల్ మణి అనే అదృష్టవంతుడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. 263 సిరీస్లో 2190 నెంబర్ టిక్కెట్ని ఆయన కొనుగోలు చేశారు. దుబయాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంకోర్స్ డి వద్ద తీసిన డ్రాలో విజేతను ఎంపిక చేశారు. 38 ఏళ్ళ మణి, ఇంటర్నేషనల్ కార్డ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓ రిటెయలర్ వద్ద 34వ యానివర్సరీ సందర్భంగా డిసెంబర్లో ఈ టిక్కెట్ని ఆయన కొనుగోలు చేశారు. 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని ఆయన అన్నారు. 1999లో మొదలైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం ప్రమోషన్లో ఇప్పటిదాకా 124 మంది భారతీయులు 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇదిలా వుంటే 33 ఏళ్ళ లతా బరద్వాజ్ బిఎండబ్ల్యు 750 ఎల్ఐఎక్స్ డ్రైవ్ ఎం స్పోర్ట్ కారుని గెల్చుకున్నారు. ఆమె దుబాయ్ డ్యూటీ ఫ్రీ మాజీ ఉద్యోగి. ఒకప్పటి సన్నిహితుల్ని కలుసుకోవడం, కారుని గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









