సౌదీలో మెదక్ జిల్లా వాసి సూసైడ్
- February 06, 2018
నిజాంపేట(మెదక్ జిల్లా), ఫిబ్రవరి 6: పొట్టకూటి కోసం వలసెళ్లిన ఓ వ్యక్తి సౌదీలో ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం (37) అప్పు చేసి మరీ రెండేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మల్లేశం మాట్లాడాడు. అయితే అదే రోజు రాత్రి తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మృతి గల కారణాలు తెలియలేదు. మృతుడి కి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని లక్ష్మి వేడుకుంది.
తాజా వార్తలు
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు









