సౌదీలో మెదక్ జిల్లా వాసి సూసైడ్
- February 06, 2018
నిజాంపేట(మెదక్ జిల్లా), ఫిబ్రవరి 6: పొట్టకూటి కోసం వలసెళ్లిన ఓ వ్యక్తి సౌదీలో ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం (37) అప్పు చేసి మరీ రెండేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మల్లేశం మాట్లాడాడు. అయితే అదే రోజు రాత్రి తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మృతి గల కారణాలు తెలియలేదు. మృతుడి కి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని లక్ష్మి వేడుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి