సౌదీలో మెదక్‌ జిల్లా వాసి సూసైడ్

- February 06, 2018 , by Maagulf
సౌదీలో మెదక్‌ జిల్లా వాసి సూసైడ్

నిజాంపేట(మెదక్‌ జిల్లా), ఫిబ్రవరి 6: పొట్టకూటి కోసం వలసెళ్లిన ఓ వ్యక్తి సౌదీలో ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్‌ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం (37) అప్పు చేసి మరీ రెండేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మల్లేశం మాట్లాడాడు. అయితే అదే రోజు రాత్రి తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మృతి గల కారణాలు తెలియలేదు. మృతుడి కి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని లక్ష్మి వేడుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com