సౌదీలో మెదక్ జిల్లా వాసి సూసైడ్
- February 06, 2018
నిజాంపేట(మెదక్ జిల్లా), ఫిబ్రవరి 6: పొట్టకూటి కోసం వలసెళ్లిన ఓ వ్యక్తి సౌదీలో ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం (37) అప్పు చేసి మరీ రెండేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మల్లేశం మాట్లాడాడు. అయితే అదే రోజు రాత్రి తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మృతి గల కారణాలు తెలియలేదు. మృతుడి కి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని లక్ష్మి వేడుకుంది.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







