దుబాయ్ లో రూ.87లక్షలు జరిమానా భారతీయుడికి
- February 06, 2018
దుబాయ్: యూఏఈ రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు.. 25 ఏళ్ల భారత కార్మికుడిపై దాదాపు రూ.87 లక్షల భారీ జరిమానాను ఆ దేశం విధించింది. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. రవాణా విభాగానికి విమర్శిస్తూ ఇ-మెయిల్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం చేస్తోందని విమర్శించారు. అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించారు. దీంతో తమను అవమానించేలా, చులకనచేసేలా సదరు మెయిల్ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసుశాఖకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించనప్పటికీ.. దుబాయ్ కోర్టు తీర్పుతో ఆయన్ను మూడు నెలలపాటు జైల్లో పెట్టారు. ఇటు ప్రభుత్వాన్ని చులకన చేసినందుకు, అవమానించినందుకు కోర్టు రూ.87లక్షలు జరిమానా విధించింది.
శిక్ష పూర్తయ్యాక నిందితుడిని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!









