దుబాయ్ లో రూ.87లక్షలు జరిమానా భారతీయుడికి
- February 06, 2018
దుబాయ్: యూఏఈ రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు.. 25 ఏళ్ల భారత కార్మికుడిపై దాదాపు రూ.87 లక్షల భారీ జరిమానాను ఆ దేశం విధించింది. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. రవాణా విభాగానికి విమర్శిస్తూ ఇ-మెయిల్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం చేస్తోందని విమర్శించారు. అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించారు. దీంతో తమను అవమానించేలా, చులకనచేసేలా సదరు మెయిల్ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసుశాఖకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించనప్పటికీ.. దుబాయ్ కోర్టు తీర్పుతో ఆయన్ను మూడు నెలలపాటు జైల్లో పెట్టారు. ఇటు ప్రభుత్వాన్ని చులకన చేసినందుకు, అవమానించినందుకు కోర్టు రూ.87లక్షలు జరిమానా విధించింది.
శిక్ష పూర్తయ్యాక నిందితుడిని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి