దుబాయ్ లో రూ.87లక్షలు జరిమానా భారతీయుడికి
- February 06, 2018
దుబాయ్: యూఏఈ రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు.. 25 ఏళ్ల భారత కార్మికుడిపై దాదాపు రూ.87 లక్షల భారీ జరిమానాను ఆ దేశం విధించింది. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. రవాణా విభాగానికి విమర్శిస్తూ ఇ-మెయిల్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం చేస్తోందని విమర్శించారు. అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించారు. దీంతో తమను అవమానించేలా, చులకనచేసేలా సదరు మెయిల్ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసుశాఖకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించనప్పటికీ.. దుబాయ్ కోర్టు తీర్పుతో ఆయన్ను మూడు నెలలపాటు జైల్లో పెట్టారు. ఇటు ప్రభుత్వాన్ని చులకన చేసినందుకు, అవమానించినందుకు కోర్టు రూ.87లక్షలు జరిమానా విధించింది.
శిక్ష పూర్తయ్యాక నిందితుడిని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







