పెళ్లికోసం కల్యాణ మండపాన్ని బుక్ చేసుకున్న విశాల్!
- February 10, 2018
తెలుగులో పుట్టి తమిళ సినీ పరిశ్రమలో రాణిస్తున్న పందెంకోడి విశాల్ రెడ్డి, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. అయితే పెళ్లి త్వరలో అంటే రెండు మూడు నెలలు , వారాలు కాదు ఏకంగా జనవరిలో. అంటే ఇంకా ఇంచుమించు సంవత్సర కాలం ఉంది. విశాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా తన పెళ్లిపై స్పందించారు. నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకే మండపాన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నానని అన్నారు. కానీ పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ చెప్పకపోవడం గమనార్హం. ఇదిలావుంటే గతంలో నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ పై మనసుపారేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







