కువైట్ లో తమకు భద్రత లేదని స్వదేశానికి వెళ్లిపోతున్న ఫిలిప్పైన్స్ ప్రవాసీయులు
- February 12, 2018
కువైట్: ' ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న మూటా సదురుకున్న ఎల్లిపోతావున్న ఈ ఊల్లొ నాకింక ఏమున్నదక్క... ఏమున్నదక్కో...ఏమున్నదక్కా. ' అంటూ కువైట్ నుంచి స్వదేశం వెళ్లిపోయేందుకు పలువురు ఫిలిప్పీన్ దేశస్థులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. ఫిలిప్పైన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ హామీని నమ్ముకొని ఆ దేశ పౌరులు సిద్ధమయ్యారు. సుమారు 2,200 మంది ప్రవాసీయులు స్వేదేశానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో వీరు తమ సొంత ప్రాంతాలకు చేరుకోనున్నారు. ఇటీవల కాలంలో కువైట్లో పనిచేస్తున్న ఫిలిప్పీనీయులపై దాడులు పెచ్చురిల్లుతున్నాయని,ముఖ్యంగా మహిళలపై వేధింపులు అధికమవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు దారుణ హత్యలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మిగిలినవారైనా ఇక ఆలస్యం చేయకుండా స్వదేశానికి తిరిగొచ్చేయాలని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ తమ పౌరులకు గత నెలలో పిలుపునిచ్చారు. గతవారం ఫిలిప్పైన్స్కు చెందిన ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం మృతదేశాన్ని ఓ ఫ్రీజ్లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై స్పందించిన ఫిలిప్పైన్స్ ప్రభుత్వం స్వదేశానికి తిరిగొచ్చేయాలంటూ పౌరులకు సూచించింది. దీంతో కొందరు పౌరులు ఫిలిప్పైన్స్ తిరిగి వెళ్లేందుకు ఇదిలావుండగా కువైట్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని అధికారులు ప్రకటించారు. కువైట్ లో దాదాపు 2 లక్షల యాభై వేలమందికి పైగా ఫిలిప్పైన్స్ ప్రవాసీయులు కువైట్లో వివిధ ఉద్యోగాలలో ఉన్నారని, అత్యధికులు కార్మికులుగానే పనిచేస్తున్నారని, ఫిలిప్పైన్స్ కు తిరిగివచ్చిన తమ పౌరులకు స్వదేశంలోనే ఉపాధిని కల్పించనున్నామని ఫిలిప్పైన్స్ మంత్రి ఇటీవల హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







