మద్యం వద్దు మార్షల్ ఆర్ట్సే ముద్దు నటుడు భానుచందర్
- February 12, 2018
అవసరమైతే రాజీయాల్లోకి మళ్లీ వస్తా సినీ నటుడు భానుచందర్ యువత ప్రస్తుత తరుణంలో మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలని అప్పుడే మంచి శరీర దారుఢ్యంతో ఆరోగ్యంగా ఉంటారని, అందుకే అరవై దాటినా తాను యువకుడిలా ఉంటానని ప్రముఖ సినీనటుడు భానుచందర్ వెల్లడించారు. కోట మండలం విద్యానగర్ సోమవారం వచ్చిన ఆయన కాసేపు 'న్యూస్టుడే'తో ముచ్చటించారు. పలు విషయాలను వెల్లడించారు.. న్యూస్టుడే, కోట ప్రశ్న : ప్రస్తుత సినిమాలపై మీ అభిప్రాయం జవాబు : ప్రస్తుతం వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడితే చాలు. వంద రోజులు, 50 రోజులు ఆడే రోజులు పోయాయి. ప్ర : సినిమాల్లోకి రాక ముందు ఏ వృత్తిలోకి వెళ్లాలనే లక్ష్యం ఉండేది? జవాబు : సంగీత దర్శకుడు కావాలని కుటుంబంలోని అందరు ప్రోత్సాహించారు. 'చివరికి నాలాగ ఎందరో' సినిమాతో హీరోగా వచ్చాను. ఇప్పటి వరకు 175 సినిమాల్లో నటించాను. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను.
విడుదల కావలసి ఉంది. సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్ల వంటివారు. నేను నటించిన చిత్రాల్లో 50 వరకు నాకు మంచిపేరు తీసుకువచ్చాయి. నంది అవార్డులు కూడా అందుకున్నాను.
నా సినిమా విమర్శకులు ముందు మా పిల్లలు, సతీమణే. బుల్లితెరపై కూడా పలు సందేశాత్మక సీరియల్స్లో నటిస్తున్నాను. ప్ర : మీ పిల్లలు సినిమా రంగంలోకి వచ్చారా? జ : నా కుమారుడు జయంత్కు సినిమా రంగం అంటే ఇష్టం, డిగ్రీ పూర్తిచేశాడు. వచ్చే నెలలో జయంత్తో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. దర్శకత్వం కూడా నేనే చేస్తున్నాను.
రెండో కుమారుడు వైద్య వృత్తిలో సేవలు అందించాలని ప్రొత్సాహిస్తున్నాను. ఆడపిల్లలు లేరనే బాధ ఇప్పటికి వేధిస్తోంది. ప్ర : రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఎందుకు ఉన్నారు? జ : రాజకీయ పరిస్థితులు బాగా లేవు. అవసరమైతే మళ్లీ వస్తాను. ప్రజలకు సేవలు అందిస్తాను. ప్ర : యువతకు మీరు ఇచ్చే సందేశం? జ : యువత ముందుగా మద్యం, డ్రగ్స్కు, వ్యభిచారానికి దూరంగా ఉండాలి.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. దాంతో ఆరోగ్యంగా ఉంటారు. నేను అరవై ఏళ్లు దాటినా ఇలా ఉన్నాను అంటే కారణం మార్షల్ ఆర్ట్సే. మద్యం, డ్రగ్స్ వాడను.
మేకప్ కూడా తక్కువగా వేసుకుంటాను. ఇప్పటికి హుషారుగా ఉంటాను. ఈ విషయాలు యువత గుర్తుంచుకోవాలి. ఆహారంలో కూడా మితంగా మాంసం తింటాను.
శాకాహారంలో గుత్తి వంకాయ, ఇతర కూరగాయలు తింటాను. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను విస్మరిస్తాను.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







