ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా
- February 12, 201828 ఏళ్ళ క్రితం శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, అమల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటి దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకుంటారనేది వాస్తవం. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగడం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పవచ్చు. విమర్శకులు సైతం ఈ సినిమాని పొగడకుండా ఉండలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారట. ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా ప్రదర్శన జరుపుకోనుండగా, ఈ స్పెషల్ షోకు నాగార్జునతో పాటు అమల, దర్శకుడు వర్మ , నాగ్, వర్మ ఫ్యాన్స్ హాజరౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్, వర్మ కాంబినేషన్లో కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ సినిమా ప్రమోషన్కి ఉపయోగపడేలా శివ సినిమా స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఓన్ బ్యానర్ కంపెనీపై కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ముంబై మోడల్ మైరా సరీన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సమ్మర్ కానుకగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!