ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా
- February 12, 2018
28 ఏళ్ళ క్రితం శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, అమల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటి దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకుంటారనేది వాస్తవం. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగడం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పవచ్చు. విమర్శకులు సైతం ఈ సినిమాని పొగడకుండా ఉండలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారట. ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా ప్రదర్శన జరుపుకోనుండగా, ఈ స్పెషల్ షోకు నాగార్జునతో పాటు అమల, దర్శకుడు వర్మ , నాగ్, వర్మ ఫ్యాన్స్ హాజరౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్, వర్మ కాంబినేషన్లో కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ సినిమా ప్రమోషన్కి ఉపయోగపడేలా శివ సినిమా స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఓన్ బ్యానర్ కంపెనీపై కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ముంబై మోడల్ మైరా సరీన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సమ్మర్ కానుకగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







