ఒమాన్ లోని సమైల్ కారాగారంలో నిరాహారదీక్ష - వార్తలను తోసిపుచ్చిన పొలిసు శాఖ

- November 25, 2015 , by Maagulf
ఒమాన్ లోని సమైల్ కారాగారంలో నిరాహారదీక్ష - వార్తలను తోసిపుచ్చిన పొలిసు శాఖ

 

ఒమాన్ లోని సమైల్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 1800 మంది ఒమనీయులు గత ఆదివారం నుండి నిరాహార దీక్షను ప్రారంభించారని వస్తున్న వార్తలను జైలు అధికారులు తోసిపుచ్చారు. 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ఇంకా ఆయా  కుటుంబాలు చేసుకున్న విజ్ఞాపనలను మన్నించి, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారు నవంబరు 17 న, 67 మంది ప్రవాసీయులతో సహా 160 మందికి రాజరిక క్షమాభిక్ష ప్రసాదించారు. ఐతే మీడియాలో చెప్పిన విధంగా ఏ  విధమైన సామూహిక నిరాహారదీక్ష జరగడం లేదని, కేవలం 10 మంది మాత్రమే తమపేర్లు క్షమాభిక్ష జాబితాలో చేర్చనందుకు ఆహారాన్ని నిరాకరించారని స్పష్టం చేసారు. వారు క్షమాభిక్ష నిబంధనలకు అనుగుణంగా లేనందున  వారి పేర్లు చేర్చబడలేదని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com