శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం
- February 13, 2018
కోయంబత్తూరు శివనామ స్మరణతో మార్మోగింది. వేలమంది భక్తులు భోళాశంకరుడి సేవలో పునీతులయ్యారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాగరణోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ వేడుకలకు వేలమంది భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, పొలిటికల్ లీడర్లు జాగరణలో పాల్గొన్నారు.
.
జాగరణోత్సవంలో భాగంగా ఇషా యోగా కేంద్రంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సోనూ నిగమ్, దలేర్ మెహందీలు నిర్వహించిన సంగీత విభావరితో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







