ప్రివ్యూ: మనసుకు నచ్చింది
- February 15, 2018
నటీనటులు : సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్ అరుణ్
నిర్మాతలు : సంజయ్ స్వరూప్, కిరణ్
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
సినిమాటోగ్రఫీ: రవి యాదవ్
ఎడిటర్ : గౌతమ్ రాజు
మ్యూజిక్ : రధన్
మహేష్బాబు సోదరి మంజుల నటిగా, నిర్మాతగా పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగా, నిర్మాతగా పెద్దగా సక్సెస్ను దక్కించుకోలేక పోయిన ఈమె చివరిగా దర్శకురాలిగా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసుకు నచ్చింది' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మహేష్బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు, సినిమా కోసం పలు సార్లు మీడియా ముందుకు వచ్చాడు. దాంతో 'మనసుకు నచ్చింది' సినిమా గురించి సినీ జనాల్లో చర్చ జరుగుతుంది.
ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చుతున్నారు.
'మనసుకు నచ్చింది' సినిమా ఆడియో మరియు ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సేఫ్ టైంలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం చేశారు.
మంజుల ఈ చిత్రం కథను నిజ జీవిత అంశాల ఆధారంగా రాసినట్లుగా చెప్పుకొచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ల కాంబో సీన్స్, వారిద్దరి మద్య రొమాంటిక్ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తాయని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్బాబు గెస్ట్గా కూడా ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మంజుల కూతురు ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై మరింతగా ఆసక్తి నెలకొంది.
మహేష్బాబు ఆశీర్వాదంతో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే విషయం తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







