చేపలు పెరుగు కర్రీ
- February 17, 2018కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3, టమేటోలు - 3, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను , అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా చీరాలి) - 5, కొత్తిమీర - 1 టేబుల్ స్పూను. ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, కస్తూరి మెంతి - 2 టీ స్పూన్లు, గరంమసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : చేపని శుభ్రపరిచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, కస్తూరిమెంతి, గరం మసాల, అల్లం, వెల్లుల్లి పెరుగులో వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించి అరగంట పక్కనుంచాలి. కడాయిలో ఉల్లితరుగు దోరగా వేగాక టమోటా ముక్కలు, చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చేపముక్కలు ఉడికి, నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం