హైదరాబాద్: మార్చి 4న ఫుడ్ ట్రక్ ఫెస్టివల్
- February 18, 2018నచ్చిన రుచుల కోసం ఎక్కడెక్కడికో పరుగుపెట్టే రోజులుపోయి... మన ముందుకే అవి వచ్చి వాలే కాలంలో ఉన్నాం. ఒకప్పుడు వీధి పక్కన ఏ తోపుడు బండిపైనో లోకల్ ఫుడ్ అలరిస్తుండేది. కానీ.. ఇప్పుడు తీరొక్క రుచులూ... మీ ముంగిటకే వచ్చి వాలుతున్నాయి. అవును... ఇప్పుడు మెట్రో నగరాల్లో జన సామాన్య ఆకలి తీరుస్తున్న నయా రెస్టారెంట్లు ఫుడ్ ట్రక్లే. ఇప్పుడు ఒకచోటకు చేరి మీ మనసుకు నచ్చే రుచులను అందించనున్నాయి. అందుకు మాదాపూర్లోని ఎలైట్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ హైదరాబాద్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్కు వేదికగా మారనుంది. అల్పాహారం నుంచి బిర్యానీ వరకు, ఐస్ క్రీం నుంచి పావ్ బాజా వరకు, దోష నుంచి దాల్ రైస్ వరకు.. ఏది కావాలన్నా ఇప్పుడు రెస్టారెంట్కి పరుగు పెట్టాల్సిన పని లేదు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్తే చాలు.. రోడ్డు పక్కన ఓ ఫుడ్ ట్రక్ రెడీగా ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాంటి ఫుడ్ ట్రక్స్ కనిపిస్తాయి. ఘుమఘుమలాడే రుచుల్ని అందిస్తాయి.
డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో అలరించే ట్రక్స్ అన్ని మార్చి 4వ తేదీన ఒక చోట చేరనున్నాయి. టిక్స్ డూ, జక్స్టపోజ్, స్టార్టప్ హైదరాబాద్, స్టూమ్యాగ్జ్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ సీజన్ 2లో వందలాది ట్రక్స్ హైదరాబాదీలను అలరించనున్నాయి. నోరూరించే రుచులు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, హైదరాబాదీ ఇలా అన్ని రకాల రుచులను ఒక చోట చేర్చే వేదిక హైదరాబాద్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ రోజంతా మీకు నచ్చిన ఫుడ్ని ఆస్వాదించేందుకు ఈ ఫెస్టివల్ని సందర్శించాల్సిందే. మాదాపూర్లోని ఎలైట్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో నిర్వహించే ఈ ఫెస్టివల్లో రకరకాల వంటలతో మ్యూజిక్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నగర వాసులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని నిర్వాహకులు తెలిపారు.
డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేయాలనుకుంటే ఈ ఫెస్టివల్ని మీరూ సందర్శించండి మరి.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు