మంచినీళ్ల బాటిల్ తో మత్తు పదార్ధాలను రహస్య సంకేతాలతో విక్రయిస్తున్న ఆసియా దేశ నిందితులు..

- February 19, 2018 , by Maagulf
మంచినీళ్ల బాటిల్ తో  మత్తు పదార్ధాలను రహస్య సంకేతాలతో  విక్రయిస్తున్న ఆసియా దేశ నిందితులు..

షార్జా :  నీళ్ల బాటిళ్లతో పోలీసుల కళ్ళు కప్పాలని చూశారా నిందితులు..కానీ అడ్డంగా దొరికిపోయారు. మత్తు కల్గించే పదార్ధాలు విక్రయిస్తే దారుణమైన శిక్షలు ఆ దేశాలలో  ఉంటాయని స్పష్టంగా తెల్సినప్పటకి కొందరు డబ్బు మోజులో పడి ప్రాణాలకు తెగించి అక్రమ రవాణా చేయబోయి అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో  ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లారు. అడ్డదారిలో అధిక డబ్బు సంపాదించాలనే కక్కుర్తితో మాధకద్రవ్యాల  అక్రమరవాణాకు పాల్పడ్డారు. మాధకద్రవ్యాల రవాణా చేయడంతోపాటు వారి ఇంట్లోనే ఆ మత్తు పదార్ధాలను రహస్యంగా నిల్వ చేశారు. డ్రగ్స్ అమ్మకానికి పాల్పడ్డారు. తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు.  డ్రగ్స్ అక్రమరవాణాకు నిందితులు ఉపయోగించిన రహస్య సాంకేతిక బాష పోలీసులు వెల్లడించారు. వాటర్ బాటిల్‌ను చేతితో పట్టుకున్న వ్యక్తి వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తాడు. మత్తు పదార్ధాలు కొనుక్కోవాలనే వ్యక్తి కూడా వాటర్ బాటిల్ చేతపట్టుకుని ఉండాలి. ఎవరికీ అనుమానం రాకుండా, ఎలాంటి సంభాషణా లేకుండా ఈ కోడ్ భాషను ఉపయోగించేవారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పూర్తిగా సమాచారం అందుకున్న తర్వాతే నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా వేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com