హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- November 27, 2015
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 55 గ్రాముల ఎల్ఎస్ డీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేసి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠాలో ముగ్గురు ఆఫ్రికన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







