సంచలనంగా జయప్రద రీ ఎంట్రీ..
- February 22, 2018
గతంలో సినీరంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పారు జయప్రద. మునుపటిలా ఇప్పుడామె రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం లేదు. ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ సినిమారంగంలోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. తన సమకాలీకులైన జయసుధ, శ్రీదేవి ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుండటం కూడా జయప్రదలో స్ఫూర్తిని నింపిందని అంటున్నారు. తనకు ఇంత గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమారంగంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో ఇకపై కొనసాగాలని, అందుకు భాషలతో నిమిత్తం లేకుండా ఓ కళాకారిణిగా తనదైన ప్రత్యేకతను మరోసారి చాటాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం వంటి వివిధ భాషల సినిమాలలో ఆమె నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన శరభ, సువర్ణసుందరి సినిమాలు ఈ వేసవిలో విడుదల కానున్నాయి. హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో కొత్త దర్శకులతో కలసి సినిమాలు చేస్తోంది. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించేందుకు, స్టార్ హీరోల తనయుల సినిమాల్లో తల్లి పాత్రలను చేసేందుకు కూడా ఆమె సంసిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమలో అంటున్నారు. వీటితో పాటు తమిళ, మలయాళంలో ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మలయాళంలో కినర్ పేరుతోనూ, తమిళంలో కెని పేరుతోనూ రూపొందిన చిత్రంలో జయప్రద ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే నీటి సమస్య ఆధారంగా రూపొందుతోంది. ఇందులో తమిళ వ్యక్తిని పెళ్లిచేసుకున్న కేరళ మహిళగా జయప్రద పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. తను మాత్రమే కాకుండా ఇందులో నాజర్, రేవతి, రేఖ, పార్తిబన్ వంటి నిన్నటితరం నటీనటులు నటిస్తున్నారు. జయప్రద ఇందులో తిరునల్వేలి జిల్లా కలెక్టర్ పాత్రలో నటించారు. దక్షిణాదిలో ఇది తనకు సరైన రీఎంట్రీ అని ఆమె అంటున్నారు. ఈ చిత్రంలో ఎస్పీ.బాలు, జేస్దాస్ కలిసి అయ్యా సామీ అనే ఓ పాటను పాడారు. ఇదిలావుండగా త్వరలో సొంతగా సినిమాలు కూడా నిర్మించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఈ తడవ ఆమె రీఎంట్రీ సినీరంగంలో సంచలనం కాబోతోందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







