ఆస్కార్ వేదికపై శశికపూర్, శ్రీదేవికి నివాళులు
- March 05, 2018
న్యూయార్క్ : 90వ ఆస్కార్ అవార్డుల వేదికపై మృతి చెందిన భారతీయ నటులు శశికపూర్, శ్రీదేవిలకు నివాళులర్పించారు. ఆస్కార్ అవార్డులు ప్రకటించే ముందు మృతి చెందిన చలనచిత్ర ప్రముఖులకు నివాళులర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వీరిద్దరూ నటించిన పలు చిత్రాల్ని బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవల్ని సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. 'ఇన్ మెమొరియం' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ చిత్రాల నిర్మాత, దర్శకుడు రోజర్ మౌరేలకు కూడా నివాళులర్పించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు మేరీ గోల్డ్బెర్గ్, జోహాన్ జోహౌన్సన్, జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్లకు కూడా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







