ఆస్కార్ వేదికపై శశికపూర్, శ్రీదేవికి నివాళులు
- March 05, 2018
న్యూయార్క్ : 90వ ఆస్కార్ అవార్డుల వేదికపై మృతి చెందిన భారతీయ నటులు శశికపూర్, శ్రీదేవిలకు నివాళులర్పించారు. ఆస్కార్ అవార్డులు ప్రకటించే ముందు మృతి చెందిన చలనచిత్ర ప్రముఖులకు నివాళులర్పించడం సంప్రదాయంగా వస్తోంది. వీరిద్దరూ నటించిన పలు చిత్రాల్ని బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవల్ని సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. 'ఇన్ మెమొరియం' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ చిత్రాల నిర్మాత, దర్శకుడు రోజర్ మౌరేలకు కూడా నివాళులర్పించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు మేరీ గోల్డ్బెర్గ్, జోహాన్ జోహౌన్సన్, జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్లకు కూడా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









