ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
- March 06, 2018
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కళాచౌకీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈస్టల్ మెటల్ కంపెనీలోని గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. ఈ కంపెనీకి సమీపంలో పలు భవన సముదాయాలు ఉండటంతో.. ముందుజాగ్రత్తగా అక్కడ నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









