నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు
- March 09, 2018
కువైట్ :నీటిలో మునిగిపోయిన ఇరువురిని రక్షించడానికి వచ్చిన ఒక రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు అయ్యాడు.స్థానిక సుబియ్య లో సముద్రపు నీరు ప్రవహించే ఒక కాలువ అంచు వెంబడి ఇరువురు వ్యక్తులు కారుని నడుపుతుండగా అకస్మాత్తుగా బురదలోనికి కారు జారిపోవడంతో ఇద్దరు పౌరులు ఉప్పునీళ్లలో మునిగిపోయారు.ఈ సమాచారం అందుకొన్న విపత్తు నివారణ జట్టు సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. నీట మునిగిన ఇద్దరు కోసం ఆ బృందం అన్వేషిస్తుండగా, కువైట్ దేశస్తుడు కానీ ఒక విపత్తు నివారణ జట్టులోని సభ్యుడు కనిపించలేదు. అయితే తొలుత కారుతో సహా నీట మునిగిన ఇరువురు పౌరులు ఈత కొడ్తూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకొన్నారు కానీ విపత్తు నివారణ జట్టు సభ్యులు తమ సహోద్యోగి ఆచూకీ కనుగొనలేకపోయారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







