ఇతని ఆచూకీ చెప్పిన వారికి.. రూ.32.56 కోట్లు
- March 09, 2018
తెహ్రీక్ యే తాలిబన్ ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఎవరైనా అతని గురించి సమాచారమిస్తే రూ.32.56 భారీ నజరానా ఇస్తామని తెలిపింది. గతకొన్నేళ్లుగా ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా పలు విధాలుగా సమాచారం సేకరించాలని ప్రయత్నించింది. కానీ అవేవి ఫలించలేదు దీంతో ఈ ప్రకటన చేసింది అమెరికా. కాగా 2016 లో పెషావర్ ఆర్మీ స్కూల్పై జరిగిన దాడిలో సూత్రధారిగా ఉన్నాడు మౌలానా ఫజలుల్లా.. ఆ దాడిలో సుమారు 150 మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాదు 2011 లో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా పై కూడా దాడి చేసింది ఈ ఉగ్రవాదే.. అలాగే ఇతనితోపాటు మరో ఇద్దరిపై కూడా అమెరికా నజరానా ప్రకటించింది. లష్కరే సంస్థకు చెందిన అబ్దుల్ వాలీ, మంగల్ భాగ్లను పట్టిస్తే 20 కోట్లు అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







