ఇతని ఆచూకీ చెప్పిన వారికి.. రూ.32.56 కోట్లు
- March 09, 2018
తెహ్రీక్ యే తాలిబన్ ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఎవరైనా అతని గురించి సమాచారమిస్తే రూ.32.56 భారీ నజరానా ఇస్తామని తెలిపింది. గతకొన్నేళ్లుగా ఉగ్రవాది మౌలానా ఫజలుల్లాపై అమెరికా పలు విధాలుగా సమాచారం సేకరించాలని ప్రయత్నించింది. కానీ అవేవి ఫలించలేదు దీంతో ఈ ప్రకటన చేసింది అమెరికా. కాగా 2016 లో పెషావర్ ఆర్మీ స్కూల్పై జరిగిన దాడిలో సూత్రధారిగా ఉన్నాడు మౌలానా ఫజలుల్లా.. ఆ దాడిలో సుమారు 150 మంది చిన్నారులు చనిపోయారు. అంతేకాదు 2011 లో నోబెల్ శాంతి అవార్డు గ్రహీత మలాలా పై కూడా దాడి చేసింది ఈ ఉగ్రవాదే.. అలాగే ఇతనితోపాటు మరో ఇద్దరిపై కూడా అమెరికా నజరానా ప్రకటించింది. లష్కరే సంస్థకు చెందిన అబ్దుల్ వాలీ, మంగల్ భాగ్లను పట్టిస్తే 20 కోట్లు అందజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









