పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!
- November 29, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్లో ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. పారిస్ బయలుదేరడానికి ముందు మోదీ విలేకరులతో మాట్లాడుతూ... పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.పారిస్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో మోదీ భేటీ కానున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా అధ్యక్షత జరిగే మిషన్ ఇన్నోవేటివ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







