పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!
- November 29, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్లో ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. పారిస్ బయలుదేరడానికి ముందు మోదీ విలేకరులతో మాట్లాడుతూ... పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.పారిస్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో మోదీ భేటీ కానున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా అధ్యక్షత జరిగే మిషన్ ఇన్నోవేటివ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









