దుబాయ్ మెట్రోలో మహిళపై మద్యం మత్తులో దాడి
- March 13, 2018
దుబాయ్ మెట్రో రైలులో ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు విచారణ జరుగుతోంది. 38 ఏళ్ళ ఇండియన్ ఒకరు, ఓ మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 14న చోటు చేసుకుంది. సేల్స్మెన్గా పనిచేస్తున్న నిందితుడు మాత్రం, తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. లైసెన్స్ లేకుండా ఆల్కహాల్ సేవించాడంటూ వచ్చిన ఆరోపణల్నీ ఆయన ఖండిస్తున్నాడు. మహిళను టచ్ చేసిన మాట వాస్తవమే అయినా, అది అనుకోకుండా జరిగిందని నిందితుడు చెప్పాడు. 27 ఏళ్ళ బాధితురాలు మాట్లాడుతూ రాత్రి 10.15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందనీ, ఆ సమయంలో నిందితుడు తప్పతాగి వున్నాడనీ, తనను గట్టిగా పట్టుకున్నాడనీ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో తీర్పుని మార్చి 27న న్యాయస్థానం వెల్లడించనుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







