దుబాయ్ మెట్రోలో మహిళపై మద్యం మత్తులో దాడి
- March 13, 2018దుబాయ్ మెట్రో రైలులో ఓ వ్యక్తి, ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు విచారణ జరుగుతోంది. 38 ఏళ్ళ ఇండియన్ ఒకరు, ఓ మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 14న చోటు చేసుకుంది. సేల్స్మెన్గా పనిచేస్తున్న నిందితుడు మాత్రం, తన మీద వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నాడు. లైసెన్స్ లేకుండా ఆల్కహాల్ సేవించాడంటూ వచ్చిన ఆరోపణల్నీ ఆయన ఖండిస్తున్నాడు. మహిళను టచ్ చేసిన మాట వాస్తవమే అయినా, అది అనుకోకుండా జరిగిందని నిందితుడు చెప్పాడు. 27 ఏళ్ళ బాధితురాలు మాట్లాడుతూ రాత్రి 10.15 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగిందనీ, ఆ సమయంలో నిందితుడు తప్పతాగి వున్నాడనీ, తనను గట్టిగా పట్టుకున్నాడనీ పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో తీర్పుని మార్చి 27న న్యాయస్థానం వెల్లడించనుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్