నైజీరియా ఘర్షణలు, 25 మంది మృతి
- March 14, 2018
సెంట్రల్ నైజీరియాలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 25 మంది చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భూమి, నీళ్లు, పశువుల మేత హక్కులకు సంబంధించి కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్లాటీ స్టేట్లోని బస్సా ప్రాంతంలో అధిక మంది చనిపోగా..తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. పశువుల కాపరులు దుండన్ నుంచి ఝిరేచి గ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో 25 మంది చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయని స్టేట్ పోలీస్ కమిషనర్ వుండీ అడీ తెలిపారు. వర్గాల మధ్య ఘర్షణలో పెద్ద సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయని, అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. గ్రామస్థులను పొట్టనబెట్టుకున్న వారిని మట్టుకరిపించేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హంట్ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దయచేసి ప్రజలంతా సంయమనంతో ఉండి..వారి ఆయుధాలను పక్కన పెట్టాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!