యూఏఈ నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపితే, ఆ నగదు బదిలీకి ఫీజు చెల్లించాలి

- March 17, 2018 , by Maagulf
యూఏఈ నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపితే, ఆ నగదు బదిలీకి  ఫీజు చెల్లించాలి

అబుదాబి, యూఏఈలో అతిపెద్ద బ్యాంకైన ఎమిరేట్స్ ఎన్‌బీడీ ప్రవాసీయులకు మింగుడుపడని వార్త తెలిపింది  ఇకపై విదేశాలకు యూఏఈ కరెన్సీని ఉపయోగించి బదిలీ చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.  యూఏఈ కరెన్సీలో చెల్లింపులు చేసేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డుల ద్వారా దిర్హమ్స్‌లో చెల్లింపులు చేసేవారు 1.15 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. యూఏఈ కరెన్సీని ఉపయోగించి అంతర్జాతీయ వాణిజ్య వెబ్‌సైట్ల ద్వారా వస్తువులను కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని, ఈ కారణంగానే ఫీజు చెల్లించాలనే నిబంధన ప్రవేశపెట్టామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. స్థానిక కరెన్సీ ద్వారా వస్తువుల కొనుగోలు, వీదేశీయానాలు చేయడం మంచిదని తమ వినియోగదారులకు అధికారులు సూచించారు. యూఏఈ కరెన్సీ ఉపయోగించి లావాదేవీలు జరపడం సులభంగా అనిపించినప్పటికీ ఖర్చుతో కూడుకున్న పనని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com