ఇండియా:మొబైల్ వినియోగదారులకు శుభవార్త

- March 21, 2018 , by Maagulf
ఇండియా:మొబైల్ వినియోగదారులకు శుభవార్త

మొబైల్ వినియోగదారులకు టెలికాం డిపార్ట్‌మెంట్‌ శుభవార్త అందించింది. గడువులోగా తమ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో  రీ-వెరిఫికేషన్ చేయాలన్న నిబంధనను మరోసారి పొడిగించింది. ఆధార్‌ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ రీ-వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లలో రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేసుకొని యూజర్లకు కొంత ఊరటనిచ్చింది టెలికాం డిపార్ట్‌మెంట్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com