స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం

- March 21, 2018 , by Maagulf
స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం

కువైట్ :  జహ్రాలోని కెజిఎల్ గ్యారేజీలో స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను  పబ్లిక్ ఆక్షన్ కు పంపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ (జిటిడి) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంతేకాక ఇదే సమాచారం ఈ నెల 20 వ తేదీన స్థానిక వార్తా పత్రికలలో, రేడియోలో మరియు టెలివిజన్లో ప్రకటనలను ప్రచురించింది, వేలం వేసే వాహనాల సంఖ్య గురించి ఈ ప్రకటన వెలువడిన రెండు వారాలలో వారి వాహనాల విషయమై  క్లెయిమ్ చేయడానికి అవకాశం సైతం ఇచ్చారు .ఆ తర్వాత విక్రయించడానికి సిద్ధపడిన కమిటీని సందర్శించడానికి త్వరితగతిన రావాలని సంబంధివాహనాల యజమానులకు పిలుపునిచ్చారు. మార్చి 28 వ తేదీ 2018 సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో పాల్గొనేవారు  కార్ల తనిఖీ చేసుకొవడానికి ఒకరోజు ముందు గారేజ్ ను  సందర్శించడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత  వేలం నిర్వహించడానికి తగిన  ఏర్పాట్లు చేసుకొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com