స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం
- March 21, 2018కువైట్ : జహ్రాలోని కెజిఎల్ గ్యారేజీలో స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను పబ్లిక్ ఆక్షన్ కు పంపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ (జిటిడి) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంతేకాక ఇదే సమాచారం ఈ నెల 20 వ తేదీన స్థానిక వార్తా పత్రికలలో, రేడియోలో మరియు టెలివిజన్లో ప్రకటనలను ప్రచురించింది, వేలం వేసే వాహనాల సంఖ్య గురించి ఈ ప్రకటన వెలువడిన రెండు వారాలలో వారి వాహనాల విషయమై క్లెయిమ్ చేయడానికి అవకాశం సైతం ఇచ్చారు .ఆ తర్వాత విక్రయించడానికి సిద్ధపడిన కమిటీని సందర్శించడానికి త్వరితగతిన రావాలని సంబంధివాహనాల యజమానులకు పిలుపునిచ్చారు. మార్చి 28 వ తేదీ 2018 సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో పాల్గొనేవారు కార్ల తనిఖీ చేసుకొవడానికి ఒకరోజు ముందు గారేజ్ ను సందర్శించడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వేలం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం