స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం
- March 21, 2018
కువైట్ : జహ్రాలోని కెజిఎల్ గ్యారేజీలో స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను పబ్లిక్ ఆక్షన్ కు పంపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ (జిటిడి) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంతేకాక ఇదే సమాచారం ఈ నెల 20 వ తేదీన స్థానిక వార్తా పత్రికలలో, రేడియోలో మరియు టెలివిజన్లో ప్రకటనలను ప్రచురించింది, వేలం వేసే వాహనాల సంఖ్య గురించి ఈ ప్రకటన వెలువడిన రెండు వారాలలో వారి వాహనాల విషయమై క్లెయిమ్ చేయడానికి అవకాశం సైతం ఇచ్చారు .ఆ తర్వాత విక్రయించడానికి సిద్ధపడిన కమిటీని సందర్శించడానికి త్వరితగతిన రావాలని సంబంధివాహనాల యజమానులకు పిలుపునిచ్చారు. మార్చి 28 వ తేదీ 2018 సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో పాల్గొనేవారు కార్ల తనిఖీ చేసుకొవడానికి ఒకరోజు ముందు గారేజ్ ను సందర్శించడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వేలం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!