విమానంలో సీటు కింద 1.222 కేజీల బంగారం
- March 23, 2018
శంషాబాద్:విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.222 కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. సదరు బంగారం సామగ్రిలో కాకుండా విమానంలోని నిందితుడి సీటు కింద లభ్యమైంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు.విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్కు వచ్చాడు. ఎయిర్పోర్టు బయటకు వస్తున్న క్రమంలో సదరు ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాస్పోర్టును పరిశీలించారు. అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. విమానంలో సీటు కింద రహస్యంగా పెట్టిన 1.222కేజీల బంగారం బిస్కెట్లను మరోవ్యక్తి అదే విమానంలో అదే సీటును బుకింగ్ చేసుకొని దిల్లీ మీదుగా వైజాగ్కు తరలిస్తాడని వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









