ప్రవాస కేరళీయుల ఆప్తుడు - డాక్టర్ అహ్మద్కు కురియన్ ప్రశంస
- March 25, 2018
తిరువనంతపురం: ప్రవాస కేరళీయులకు, గల్ప్ నుంచి తిరిగి వచ్చిన వారికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎస్ అహ్మద్ కీలక పాత్ర వహించారని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పిజె కురియన్ కొనియాడారు. సామాజిక సేవకు ఇటీవల అహ్మద్ను గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా జరిగిన సత్కార సభలో కురియన్ ప్రసంగించారు. కుటుంబ నియంత్రణ పథకాల అమలు సహా పలు రంగాల్లో అన్ని తరగతుల ప్రజల సంక్షేమానికీ కృషి చేశారని కురియన్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఆల్ కేరళ రిటర్నీస్ ఆర్గనైజేషన్ను 1988లో అహ్మద్ స్థాపించారు. ప్రస్తుతం దేశ విదేశాల్లోని 36 ఎన్నారై సంస్థల సంఘానికి ఆయన సమన్వయ మండలి చైర్మన్గా ఉన్నారు. బతుకు తెరువు కోసం దేశంలోని తమ స్వస్థలాలను విడిచి వెళ్లిన వారి సమస్యలను పరిష్కరించడానికి అంకితం కావాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర అహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







