సౌదీపై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణుల ప్రయోగం
- March 26, 2018
రియాద్ : యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీపై విరుచుకుపడ్డారు. రియాద్ నగరంలోని పలు ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగించారు. తిరుగుబాటు దారులు జరిపిన క్షిపణుల దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సౌదీ సంకీర్ణదళాల అధికార ప్రతినిధి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..రియాద్ నగరంపై తిరుగుబాటుదారులు ఏడు క్షిపణులు ప్రయోగించారు. వాటిలో మూడు క్షిపణులను తమ బలగాలు ధ్వంసం చేశాయని అన్నారు. సౌదీలోని ఆబా, జీజన్, నజ్రాన్ నగరాల్లోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు క్షిపణులు ప్రయోగించి ఉంటారని అనుమానిస్తున్నామని అన్నారు. కాగా, తామే సౌదీపై క్షిపణులు ప్రయోగించినట్టు హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి మొహ్మద్ అల్-బుఖైతీ సోమవారం తెలిపారు. యెమెన్లోని అనేక నగరాలపై సౌదీ సంకీర్ణదళాలు వైమానిక దాడులకు పాల్పడ్డాయని, ఆ దాడులకు ప్రతీకారంగా క్షిపణులు ప్రయోగించినట్టు పేర్కొన్నారు. సౌదీపై మధ్య స్థాయి, అధిక దూరం ప్రయాణించగల ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









